నరేంద్ర మోడీ ఎన్టీఆర్ నామస్మరణ, బాబుకు ఆహ్వానం
ఎన్టీఆర్ కాంగ్రెసు వ్యతిరేక వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ముందుకు రావాలని మోడీ పిలుపునిచ్చారు. కాంగ్రెసు నుంచి దేశానికి విముక్తి కలిగించడమే ఎన్టీఆర్కు సరైన నివాళి అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
దేశంలో కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు ఏర్పడటానికి ఎన్టీఆరే కారణమన్నారు. కాంగ్రెసు వ్యతిరేక కూటమిని ఆయన బలోపేతం చేశారని కొనియాడారు. కాంగ్రెసు నుంచి భారత దేశానికి విముక్తి కలిగించడమే ఎన్టీఆర్కు సరైన నివాళి అని మోడీ చెప్పారు. ఎన్టీఆర్ కారణంగానే కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పడిందన్నారు. కాంగ్రెసు వ్యతిరేక కూటమిని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పైనా ప్రశంసలు కురిపించారు. తమిళనాడును చూసి ఆంధ్రప్రదేశ్ నేర్చుకోవాలన్నారు.
కాగా, ఎన్టీఆర్ వారసత్వం ప్రస్తుత టిడిపి కొనసాగించాలని మోడీ వ్యాఖ్యానించడం ద్వారా తెలుగుదేశం పార్టీని ఆయన ఎన్డీయేలోకి ఆహ్వానించారు. తెలుగుదేశంలోని తెలంగాణ టిడిపి నేతల్లో కూడా దానిపై చర్చ సాగుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.