హైదరాబాద్పై చిరు, రాష్ట్రపతి పాలన ఉండదని బొత్స

విభజన నేపథ్యంలో అందరికీ సమ న్యాయం కావాలన్నారు. ఎకె ఆంటోనీ కమిటీకి తమ డిమాండ్లను, సమస్యలను వివరిస్తామని చెప్పారు. ఆంటోని కమిటీకి సమస్యలు వివరించినా ఎలా అమలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వపరంగా కమిటీ వేస్తే కమిట్మెంట్ ఉంటుందన్నారు. హైదరాబాదుతో భవిష్య్తత్తు ముడివడి ఉందని సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతులకు నీరు పెద్ద సమస్యగా మారనుందన్నారు.
రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదు: బొత్స, ఢిల్లీకి ప్రయాణం
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ హైదరాబాదులో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రులే కాకుండా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ తమ అభిప్రాయం చెప్పారన్నారు. ఆంటోనీ కమిటీకి ప్రజల సందేహాలను తాము వివరిస్తామని చెప్పారు. ఆర్టీసి కార్మికులు దయచేసి సమ్మెను విరమించుకోవాలని కోరారు.
కార్మికుల ఆకాంక్షను తాము అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. విభజన ఓట్లు, సీట్ల కోసం జరగలేదన్నారు. కాంగ్రెసు పార్టీ అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తుందన్నారు. సమ్మె వల్ల ప్రజా జీవనం స్తంభించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబు ఇప్పుడు కాంగ్రెసు పైన నెపం వేయడం సరికాదన్నారు. సమైక్యాంధ్ర కోసం తాము ఆఖరి వరకు ఉద్యమిస్తామన్నారు. కాగా బొత్స ఈ రోజు ఢిల్లీకి బయలుదేరారు.
సమ్మెపై సిఎం సమీక్ష
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమ్మెపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ఉద్యోగుల హాజరు శాతంపై ఆరా తీశారు. తిరుమల కొండ పైన ఉన్న భక్తులను కిందకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications