నేను ఉగ్రవాదిని కాను, నేనే భారత్ వస్తా: సయీద్

Mohammad Saeed
ఇస్లామాబాద్: తాను ఉగ్రవాదినని నిరూపించాలని జమాత్ ఉద్ దావా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ సవాల్ చేశారు. ముంబై ఉగ్రవాద దాడుల్లో భారత్ ఆయనను నిందితుడిగా భావిస్తున్న విషయం తెలిసిందే. తాను ఉగ్రవాదిని కానని చెప్పారు. తాను దోషినో కాదో తేల్చడానికి పాకిస్తాన్, భారత్‌లకు చెందిన న్యాయమూర్తులతో స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

భారత్ తనను నిరంతరంగా ఉగ్రవాదిగా చెబుతోందని, తాను ఉగ్రవాదిని కానని, భారత్ సంతృప్తి చెందకపోతే తనపై భారత్, పాకిస్తాన్‌లకు చెందిన సీనియర్ న్యాయవాదులు, న్యాయమూర్తులతో న్యాయ సంఘాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆయన అన్నాడు.

న్యాయ సంఘం వచ్చే నిర్ధారణకు తాను అంగీకరిస్తానని ఆయన చెప్పాడు. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాహోర్‌లో జరిగిన ఓ సభలో ఆయన బుధవారం మాట్లాడాడు. తనను అప్పగించాలని భారత్ పాకిస్తాన్‌ను కోరడాన్ని ఆయన తప్పు పట్టాడు.

తన కోసం భారత్ ఆసక్తిగా చూస్తోందని, ఆందోళన వద్దని, తానే భారత్ వస్తానని సయీద్ అన్నాడు. భారతదేశంలోని ప్రతి ఒక్కరూ తనను ఉగ్రవాదిగా పిలుస్తున్నారని, కానీ తన పార్టీ చేపట్టిన వరద బాధితులకు చేసిన సహాయాన్ని చూడడం లేదని ఆయన అన్నాడు.

తాను భారతదేశాన్ని ఎప్పుడూ హెచ్చరించలేదని, భారత్ నైజాన్ని తాను ప్రపంచం ముందు బయటపెడుతున్నానని, వరద నీటిని యేటా పాకిస్తాన్‌లోకి వదులుతూ భారత్ తమను నాశనం చేస్తోందని ఆయన అన్నాడు. చట్టవిరుద్ధంగా తమ నీటిని వాడుకుంటూ విద్యుత్తును తయారు చేసుకుంటోందని అన్నాడు. కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలోని అమాయక కాశ్మీరీలను చంపుతున్నారని ఆయన ఆరోపించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+