కూర్చోబెట్టి మాట్లాడాలి: శీలం, సమన్యాయమంటే..: చిరు

ప్రజల తరఫున వారి అభిప్రాయాలను అదిష్టానానికి చెబుతున్నామన్నారు. శాసన సభ్యులతో మాట్లాడిన తర్వాత మరోసారి చర్చించే అవకాశాన్ని తమకు ఇవ్వాలని కోరామన్నారు. కాగా హైదరాబాదులో ద్వితీయశ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి సీమాంధ్రులకు రానివ్వవద్దని, రాజధానిని కోల్పోవడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారని కేంద్రమంత్రులు ఎకె ఆంటోనీ కమిటీకి కేంద్రమంత్రులు విన్నవించుకున్నారు.
పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా సీమాంధ్ర ప్రజలను శాంతపరిచే విధంగా ఏదో విధాన ప్రకటన చేయాలని వారు మొర పెట్టుకున్నారు. వారు సీమాంధ్రుల ఆందోళనను కమిటీ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నెల 30లోగా సీమాంధ్రులను శాంతపర్చేలా విధాన ప్రకటన చేయాలని కోరారు. భాగ్యనగరంతో వారి భావోద్వేగాలు ముడివడి ఉన్నాయని, దానిని కోల్పోవడం వారు జీర్ణించుకోలేరన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం అంతకంతకు పెరుగుతోందని తెలిపారు. నాయకత్వం లేకుండానే రోజు సుమారు నాలుగైదు లక్షల మంది రోడుల మీదకు వస్తున్నారని, ప్రస్తుతం ఎపిఎన్జీవోలు సమ్మె మొదలుపెట్టడం వల్ల ఉద్యమ తీవ్రత మరింత పెరిగే అవకాశముందన్నారు. గురువారం రాత్రి సుమారు గంటన్నర పాటు కమిటీ సభ్యులైన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్లతో కేంద్రమంత్రులు భేటీ అయ్యారు. ఒక కిల్లి కృపారాణి మాత్రం హాజరు కాలేదు. కాగా తెలంగాణ ఆపేది కాదని ఆంటోనీ కేంద్రమంత్రులకు స్పష్టం చేశారు.
ప్రజలందరికీ సమన్యాయం చేయాలని కోరినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చెప్పారు. సమన్యాయం అంటే విభజన తర్వాత హక్కుల్లో న్యాయం కోసం అడుగుతున్నారా అని విలేకరులు ప్రశ్నిస్తే.. 'నో.. నో.. మీరు అలా వక్రీకరించవద్దు. సమన్యాయం అంటే ఎవరికీ అన్యాయం జరగకూడదని అర్థం' అని చిరు అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications