వైఎస్ వల్లే విభజన: సోమిరెడ్డి, విజయమ్మపై ఫైర్

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు నేతల సంతకాలతో వైయస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిందించారు. తెలంగాణ గురించి పుల్లూరు సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ విజయమ్మ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. విజయమ్మ సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్నానని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి 41 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన నివేదికతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారని విజయమ్మ చెప్పారు. ఇప్పుడు నిరవధిక దీక్షలు ఆమె డ్రామాలు చేస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ ముందు కేంద్ర మంత్రులు అస్త్ర సన్యాసం చేశారని ఆయన విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఇరు ప్రాంతాలవారిని రెచ్చగొట్టేలా మాట్టాదుతున్నారని, ఆంటోనీ పెదవి విప్పడం లేదని ఆయన మండిపడ్డారు. కనీసం బిజెపి నేత ఉమాభారతికి ఉన్న ఆదరణ కూడా దిగ్విజయ్ సింగ్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రం గొంతు కోస్తున్న దిగ్విజయ్ వెనుక కేంద్రమంత్రులు ఉంటారా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్రలు మనోభావాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడంలేదని, విభజనపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. సీమాంధ్ర ప్రజల ఆవేదన వినేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని వేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+