జగన్కు 'న్యూస్ రీడర్' రాణి రుద్రమ గుడ్బై, బిజెపిలోకి!
రాణీ రుద్రమ నిరుడు నవంబరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తెలంగాణపై ఆ పార్టీ యూ టర్న్ తీసుకోవడంతో ఇతర సీనియర్ నేతల దారిలోనే ఆమె రాజీనామా చేశారు. రాణీ రుద్రమ తెలంగాణ ఛానెల్లో పని చేశారు.
ఆమెను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓ అసెట్గా భావించారని అంటారు. తెలంగాణ న్యూస్ చానెల్ టీ- న్యూస్లో యాంకరింగ్ ద్వారా, వార్తా పఠనం ద్వారా రాణి రుద్రమ ఓ ఇమేజ్ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత నర్సంపేట నుండి పోటీ చేసేందుకు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
రాణీ రుద్రమకి రాజకీయానుభవం లేదు. కానీ ఆమె వెనక రాజకీయ దురంధరులు ఉండవచ్చుననే ఊహాగానాలు అప్పుడు వినిపించాయి. టివి యాంకర్గా ఆమె ప్రజలకు చిరపరిచితులయ్యారు. ఇప్పుడు జగన్ పార్టీ యూ టర్న్ తీసుకోవడంతో బిజెపిలో చేరేందుకు సిద్దమయ్యారట.