ఎపిని తెలంగాణ అన్నా అభ్యంతరంలేదు: గజల్ శ్రీనివాస్
కిరణ్ను కలిసిన ఎంపీలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీలో ఈ రోజు పలువురు పార్లమెంటు సభ్యులు కలిశారు. లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు కలిశారు.
హైదరాబాద్ తెలంగాణదే: మందకృష్ణ
రాష్ట్ర రాజధాని హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హైదరాబాదులో అన్నారు. ఆస్తుల పరిరక్షణ కోసమే సమైక్య ఉద్యమమని ఆరోపించారు. బడుగులకు అధికారం దక్కకుండా కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు.
సహకరించండి: టిఎన్జీవో
విభజనకు సీమాంధ్రులు, సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలని టిఎన్జీవో నేతలు దేవి ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్లు వేరుగా కోరారు. తాము ఎవరిని రెచ్చగొట్టడం లేదన్నారు. ఈ నెల 22న సచివాలయంలో సద్భావన ర్యాలీలో పాల్గొంటామని చెప్పారు. శాంతియుతంగానే తాము ఈ నిరసన తెలుపుతామన్నారు. ప్రాంతాలుగా విడిపోయినా ఉద్యోగులుగా కలిసుందామన్నారు. విడిపోయినా సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరిగితే తాము అండగా ఉంటామన్నారు. సీమాంధ్రలో తెలంగాణ వారిపై దాడిని ఖండిస్తున్నానన్నారు.