జగన్ కేసు: ఐదు గంటలు ధర్మానను ప్రశ్నించిన సిబిఐ

బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వారిద్దరిని అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి) విజ్ఝప్తి మేరకు లేపాక్షి నాలెడ్జ్ హబ్కు భూములు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం జారీ చేసిన జీవోపై సిబిఐ అధికారులు తనను ప్రశ్నించినట్లు ధర్మాన ప్రసాదరావు చెప్పారు. విచారణ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
భూముల కేటాయింపు ప్రక్రియ గురించి తాను సిబిఐకి వివరించినట్లు ఆయన తెలిపారు. తనకు తెలిసిన వివరాలను సిబిఐ అధికారులకు తెలిపినట్లు చెప్పారు. సిబిఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని ధర్మాన అన్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్కు కేటాయించిన భూముల వినియోగం తీరు తన పరిధిలోకి రాదని, కేటాయించిన ప్రయోజనం కోసం వాటిని వాడారా, లేదా అనేది పరిశ్రమల శాఖ చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
సిబిఐ అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్పినట్లు ఆయన తెలిపారు. మళ్లీ రావాలని తనకు చెప్పలేదని ఆయన అన్నారు. వాన్పిక్ భూముల కేటాయింపు వ్యవహారంలో కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో ధర్మాన ప్రసాదరావు పేరును సిబిఐ నిందితుడిగా చేర్చింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications