విభజన విషయం కొందరికి ముందే తెలుసు: ఆమంచి

వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని ఆమంచి స్వగృహం నుంచి మోటారు సైకిళ్ల ర్యాలీతో దీక్షా సెంటర్కు చేరుకున్నారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షలో కూర్చున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు రాజీనామా చేసినట్లయితే రాష్ట్ర విభజన జరగదని ఆమంచి అన్నారు.
జెపి ఆక్షేపణ
ఇంజనీరింగ్ ప్రవేశాలకు జరుగుతున్న కౌన్సెలింగ్కు సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు సహకరించాలని లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కూకట్పల్లి శాసన సభ్యుడు జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాదులో కోరారు. ఏ ప్రాంతమైనా రాజకీయ ఉద్యమాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం సరికాదని ఆయన హితవు పలికారు.
ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సమస్యలకు సామరస్య పరిష్కారం చూపేందుకు లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో మూడు ప్రాంతాల్లోనూ బహిరంగ సభలను నిర్వహించనుందని జేపీ ప్రకటించారు.












Click it and Unblock the Notifications