పదవి కోసమే శైలజానాథ్, రాయల టికి అవకాశం: జెసి
అందుకే తాము కర్నూలు, అనంతపురంలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. ఆంటోని కమిటీ హావభావాలు రాయల తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని, రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో తలెత్తే రాజధాని గొడవ సమసిపోతుందన్నారు. ఈ ప్రతిపాదనకు తెలంగాణ రాష్ట్ర సమితిలో సగం మంది, మజ్లిస్ పార్టీ అనుకూలంగా ఉందన్నారు.
ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీని తాము ఒప్పిస్తామన్నారు. త్వరలో కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలం భేటీ అవుతామని చెప్పారు. రాయల తెలంగాణ కాని పక్షంలో కర్నూలును రాజధాని చేయాలన్నారు. అయినా దానికి తాము అంగీకరించే అవకాశాలు తక్కువన్నారు. నీళ్లు, ఉద్యోగాల దృష్ట్యా తెలంగాణలోనే కలవాలనుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసుకు డిపాజిట్లు కూడా రావన్నారు. శైలజానాథ్ ఒక్కడే పెద్ద పదవికి ఆశపడుతున్నారని, అందుకే సమైక్యవాదం వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఒకటే కష్టమేంటే మూడా?: జగ్గారెడ్డి
ఒక్క రాష్ట్రం ఇవ్వడమే కష్టంగా ఉంటే కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ మూడు రాష్ట్రాలుగా చేసి, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని చెప్పడం సరికాదని ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి వేరుగా అన్నారు. తాను సమైక్యవాదిని అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని, ఆయనపై విమర్శలు చేయడం కేంద్రమంత్రికి సరికాదన్నారు.