వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: మంత్రి గీతారెడ్డికి షాక్, సిబిఐ సమన్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Geetha Reddy
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి జె. గీతారెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో షాక్ తగిలింది. ఆమెకు సిబిఐ సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం ఆమెకు సిబిఐ ఈ సమన్లు జారీ చేసింది. ఆమె విచారణకు అనుమతి ఇవ్వాలని సిబిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఆమెను ఇంటి వద్దనే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి సూచించింది.

అనంతపురం జిల్లాలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో తలపెట్టిన లేపాక్షి నాలెడ్జి హబ్ ప్రాజెక్టు విషయంలో సిబిఐ గీతారెడ్డికి ఆ సమన్లు జారీ చేసింది. రేపు గానీ ఎల్లుండి గానీ సిబిఐ అధికారులు గీతారెడ్డిని విచారించే అవకాశం ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ జీవోల విషయంలో సిబిఐ ఆమెను ప్రశ్నించనుంది.

వైయస్ జగన్ కేసులో మోపిదేవి వెంకటరమణ అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. అరెస్టయిన తర్వాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వైయస్ జగన్ కేసులో మరో ఇద్దరు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిని సిబిఐ నిందితులుగా చేర్చింది. చాలా రోజులు మంత్రులుగా కొనసాగిన వారిద్దరు చివరికి రాజీనామా చేశారు.

వైయస్ జగన్ కేసులో మొత్తం ఆరుగురు మంత్రులపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరో ఇద్దరు మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, పొన్నాల లక్ష్మయ్యలపై కూడా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ ఇదివరకు విచారించింది. కన్నా లక్ష్మినారాయణను విచారించాల్సి ఉంది.

English summary
CBI has summoned minister J Geetha Reddy in YSR Congress party president and Kadapa MP YS Jaganmohan Reddy DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X