పిలిచి మరీ మందు తాగించారు, మత్తులో రేప్ చేశారు
ఈ నెల 21వ తేదిన బాధిత మహిళ పొలం పనుల కోసం వెళ్లి వస్తోంది. ఆ సమయంలో నిందితులు రోడ్డు పక్కన మందు తాగుతూ, మాంసం తింటున్నారు. ఆమెను గమనించిన వారు మందు, మాంసం ఆశ చూపి దగ్గరకు రప్పించుకున్నారు. ఆమెకు తాగించారు. మత్తులో ఉన్న ఆమెను గాయపర్చారు. అనంతరం ఆమెపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు.
బాధితురాలు తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా నిందితులు నేరం అంగీకరించలేదు. అయితే, తాము దోచుకున్న నగలు మాత్రం ఇస్తామని చెప్పారు. రెండు రోజుల క్రితం నగలను స్వాధీనం చేసుకొని బాధితురాలికి అప్పగించారు. ఈ విషయమై సోమవారం కేసు నమోదయింది. ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు.
మైనర్ బాలికపై అత్యాచారం
వికలాంగురాలైన పద్నాలుగేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలంలో జరిగింది. గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న వికలాంగరాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నారు.