తొందరొద్దు... చర్చిస్తున్నాం: గంటాను వారించిన కిరణ్
వారు గవర్నర్ను కలిసే ముందు ముఖ్యమంత్రిని కలిశారు. తాము రాజీనామాలు ఆమోదింప చేసుకుంటామని చెప్పారు. అయితే, కిరణ్ వారిని వారించారట. ఏ నిర్ణయం తీసుకున్నా సమష్టిగా తీసుకుందామని, అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయని, తొందరపడవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది.
కిరణ్ వద్దే రాజీనామాలు: శత్రుచర్ల
తమ రాజీనామాలు ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయని మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్న తాము సమష్టిగా తీసుకుంటామని చెప్పారు.
హైకోర్టులో ఎపిఎన్జీవో సమ్మెపై వాదన
ఎపిఎన్జీవో సమ్మె పైన హైకోర్టులో సోమవారం వాదనలు ప్రారంభమయ్యాయి. సమ్మె పైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని, ఎలాంటి ఫలితం వచ్చిందని కోర్టు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. సమ్మె అంశంపై ఎస్మా, మంత్రుల కమిటీ వేశామని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
సిఎస్, డిజిపిలు సమ్మెను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. గవర్నర్ నివేదిక కోరుతామని కేంద్రం కోర్టుకు తెలిపింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. టిఎన్జీవోల సమ్మె పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ పైన తీసుకుంటున్నారని ఎపిఎన్జీవో న్యాయవాది చెప్పారు.