2017వరకు గుజరాత్ సేవ: ప్రధాని పదవిపై మోడీ ట్విస్ట్
గాంధీనగర్: 2014లో భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ముందుకు వస్తారని భావిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ గురువారం కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తాను 2017 వరకు గుజరాత్ రాష్ట్రానికే సేవ చేస్తానని చెప్పారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అహ్మదాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ మాట్లాడారు. తన రాష్ట్ర ప్రజలకు తాను 2017 వరకు సేవ చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరు ఏదో చేయాలని కలలు కంటారని, తనకు తన రాష్ట్రానికి సేవ చేయాలని ఉందని చెప్పారు. తన దృష్టి అంతా గుజరాత్ పైనే ఉందన్నారు.

గత కొన్నాళ్లుగా బిజెపి లేదా ఎన్డీయే ప్రధాని రేసులో నరేంద్ర మోడి ముందంజలో ఉన్నారు. ఆయనను ఎన్నికల ప్రచార సారథిగా ప్రకటించడం వెనుక 2014 నాటికి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకేననే ప్రచారం జరిగింది.
అయితే, ఇప్పుడు మోడీ తాను 2017 వరకు గుజరాత్కు సేవ చేస్తానని చెప్పి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. మోడీ తన వ్యాఖ్యల ద్వారా ప్రస్తుతానికి ఎన్డీయే ప్రధాని అభ్యర్థిత్వంగా తనపై చర్చకు తెర దించే ప్రయత్నాలు చేశారా? లేక నిజంగానే గుజరాత్కు పరిమితం అవుతారా? అదే జరిగితే అగ్రనేత అద్వానీ, సుష్మా స్వరాజ్ తదితరులు ప్రధాని రేసులో ఉంటారు.
-
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications