భార్య ప్రియుడ్ని ఎదుటే హత్య చేసిన పెయింటర్
వివరాలు ఇలా ఉన్నాయి - భార్య భువనేశ్వరితో గొడవ పడి అలపక్కమ్లోని రాజీవ్ గాంధీ నగర్కు చెదిన ఎం శక్తివేల్ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతను శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత పన్నెండున్నరకు తిరిగి వచ్చాడు. తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా ఇంటిలోకి చొరబడ్డాడు.
తాను చూసేసరికి భార్య భువనేశ్వరి సతీష్ అనే పొరుగింటి వ్యక్తితో పడుకుని ఉంది. దాంతో తీవ్ర కోపావేశానికి గురై శక్తివేల్ సతీష్పై కత్తితో దాడి చేశాడు. భార్య భువనేశ్వరి ఎదుటే అతన్ని చంపేశాడు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో శక్తివేల్ ముగ్గురు పిల్లలు కూడా పక్క గదిలో పడుకుని ఉన్నారు.
ఆ తర్వాత పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసులకు వివరాలు చెప్పాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఏడాది క్రితం భువనేశ్వరి సతీష్తో కలిసి పారిపోయినట్లు తెలుస్తోంది. శక్తివేల్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు పెట్ిట ఆమెను పట్టుకున్నారు. పోలీసులు ఆమెను హెచ్చరించి భర్తతో ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఆమె సతీష్తో తన సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది.