మేకల పెంపకంలో వినూత్న పద్దతులను అమలు చేయడంలో ముందుంది తమిళనాడుకు చెందిన అగ్రోటెక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. తమిళనాడులోని విల్లూపురం జిల్లాలో కొందరు రైతులు ఈ సంస్థను కంపెనీస్ యాక్ట్ 2013 కింద ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ సంస్థ ప్రారంభించిన మేకల పెంపకం ద్వారా స్వయం సహాయక బృందాలు, గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలలో సామాజిక అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబనతో పాటు వీరి కుటుంబంలో ఆర్థిక వృద్ధిని తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వంలోని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో వచ్చే స్మాల్ ఫార్మర్స్ అగ్రిబిజినెస్ కన్సార్టియంకు తమ పరిధిలో పలు వ్యూహాత్మక మార్గదర్శకాలను రూపొందించింది.
అగ్రోటెక్ ప్రత్యేకత ఏమిటి..?
(a) మహిళాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని మన దేశంలో సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన మహిళలను ఆదుకోవడమే తమ ఇతివృత్తం అని అగ్రోటెక్ చెబుతోంది.
(b)భూమిలేని మహిళా రైతుల జీవితాలను అనిశ్చిత లేదా ఒకరిపై ఆధారపడే స్థితి నుండి స్వయం సమృద్ధి వ్యవస్థాపక స్థితికి తీసుకెళ్లడం తమ ముందన్న లక్ష్యమని ఇందుకోసం ఈ మేకల పెంపంకం కార్యక్రమం ఆవిష్కరిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
(c) మేకల పెంపకం కార్యక్రమం ద్వారా సొంత భూమిలేక ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతు కుటుంబాలకు స్థిరమైన జీవన శైలిని అందించడం తమ ధ్యేయమని అగ్రోటెక్ యాజమాన్యం చెప్పింది. విల్లుపురం జిల్లాలో పలు క్లస్టర్లలో సామాజికంగా వెనకబడిన మహిళలకు మంచి జీవనశైలిని అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు అగ్రోటెక్ తెలిపింది.
(d) మంచి వ్యవసాయ సాధన (జిఎఫ్పి) ద్వారా సభ్యులను / వాటాదారులను ప్రోత్సహించడం మరియు మద్దతు ఇవ్వడం ద్వారా సంపన్నమైన స్థిరమైన వ్యవసాయ రంగాన్ని నిర్మించడం మరియు భారత ప్రభుత్వం / తమిళనాడు ప్రభుత్వం, పరిశోధనా సంస్థలు, ఆర్థిక సంస్థలు ఇతర ప్రైవేట్ రంగాల పరిశ్రమల మద్దతుతో మొత్తం మార్కెటింగ్ నెట్వర్క్ ద్వారా వారి ఉత్పత్తులకు రాబడిని కల్పించడం తమ ప్రత్యేకత అని అగ్రోటెక్ వెల్లడించింది.
(e) మొత్తం పర్యావరణ వ్యవస్థకు సరైన సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాలను సాధించడానికి సామాజిక సంస్థ నమూనా సూత్రాలపై వ్యూహాలు రూపొందించినట్లు వెల్లడించింది.
అగ్రోటెక్ ప్రత్యేక ప్రతిపాదనలు
నిబద్ధత ఉన్న సభ్యులను చేర్చడం
వినూత్న పద్ధతులు సాంకేతికతను వినియోగించి వాటాదారుల అంటే రైతు నుంచి కస్టమర్ల వరకు పోటీలో నిలదొక్కుకునేందుకు కృషి
కిసాన్ బజార్ కాన్సెప్ట్ను అభివృద్ధి చేసి ప్రతిఒక్క వాటాదారుడిని విజయం వైపు నడిపించడం
ఈ-కామర్స్ మోడల్ దేశంలోనే తొలిసారిగా తీసుకురావడం
మంచి ఫలితాల కోసం న్యూజిలాండ్ ఇతర యూరోపియన్ దేశాలతో జతకట్టడం
డిమాండ్ సప్లయ్ సామర్థ్యంకు తగ్గట్టుగా కార్యకలాపాలు నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవడం
ఏపీలో అగ్రో టెక్ ప్రారంభం
ఇక మేకల పెంపకంలో మంచి ఫలితాలు సాధించడంతో భారత్తో తొలి గోట్ పార్క్ను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది అగ్రోటెక్ సంస్థ. మేకల పెంపకం రంగంలో అనంతపురం రైతువర్గానికి మేలు చేకూర్చేందుకు గోట్ పార్క్ తోడ్పడుతుందని యాజమాన్యం తెలిపింది. మొత్తం 25 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేస్తుండగా అందులో వీటిని ఏర్పాటు చేస్తున్నాం:
ఉప ఉత్పత్తుల ద్వారా నెలవారీ ఆదాయం
పశుగ్రాసం లేదా మేత కోసం భూమి
మేకల కోసం వైద్య సదుపాయం
హైడ్రోఫిక్స్
మేకల పెంపకానికి నీరు ఇతరత్ర వసతులు
పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం
అన్ని వేళలా అందుబాటులో ఉండే అగ్రోటెక్ నిపుణులు
ఇలాంటి ఒక వినూత్నమైన కార్యక్రమంలో భాగస్వామిగా చేరి మీరు కూడా నెలవారీ ఆదాయం పొందాలనుకుంటే సంప్రదించండి.
వెబ్సైట్:
https://www.agrotechfpc.org/
https://www.agrotechfpc.com/
ఈమెయిల్ :[email protected]
మొబైల్ నెంబర్లు: 7569941213
98842 99871
9361173369
RECOMMENDED STORIES