ఏపీలో కూడా తగ్గుముఖం: 1627 కేసులు.. 17 మంది మృతి
కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో కూడా తక్కువ కేసులు వస్తున్నాయి. గత 24 గంటల్లో 1,627 మందికి కరోనా సోకింది. 17 మంది మృతిచెందారని హెల్త్ బులెటిన్లో ప్రభుత్వం పేర్కొంది వెల్లడించింది. ప్రస్తుతం 21 వేల 748 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 13 వేల 273 మరణాలు సంభవించాయి.
గత 24 గంటల్లో 2 వేల 17 మంది డిశ్చార్జ్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు కరోనాతో చనిపోయారు. కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కడప జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. ఇక కరోనా సోకిన వారి సంఖ్యను జిల్లాల వారీగా చూస్తే అనంతపురం 16 కేసులు.. చిత్తూరు 357. ఈస్ట్ గోదావరి 284. గుంటూరు 81. వైఎస్ఆర్ కడప 126. కృష్ణా 103. కర్నూలు 12. నెల్లూరు 216. ప్రకాశం 235. శ్రీకాకుళం 26. విశాఖపట్టణం 57. విజయనగరం 4. వెస్ట్ గోదావరి 110.. మొత్తంగా 1,627 కేసులు వచ్చాయి.
Recommended Video
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.