అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో పెరిగిన కేసులు: నిన్నటికన్నా 470 ఎక్కువ.. 20 మంది మృతి

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో స్వల్పంగా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 70 వేల 695 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 2010 మందికి కరోనా సోకింది. నిన్న 1540 కేసులు రాగా.. ఇవాళ మరో 470 కేసులు పెరిగాయి. మొత్తం కేసుల సంఖ్య 19,59,942కి చేరాయి.

20 మంది మృతిచెందారని హెల్త్ బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొంది. దీంతో మృతుల సంఖ్య13,312కి చేరింది. 24 గంటల్లో 1956 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న మొత్తం సంఖ్య 19,25,631కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,999 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,43,24,626 నమూనాలను ఆరోగ్యశాఖ పరీక్షించింది.

2010 people infected corona in andhra pradesh

Recommended Video

COVID Third Wave : వేగంగా వ్యాప్తి, కొత్త డెల్టా-ప్లస్ వేరియంట్.. 6 To 8 Weeks : AIIMS Chief

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది.

English summary
last 24 hours 2010 people infect corona in andhra pradesh and 20 people died due to virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X