ఏపీ డీఎస్సీ 2 వారాలు వాయిదా.. అభ్యర్థుల వినతి మేరకు ప్రభుత్వ నిర్ణయం

అమరావతి : ఏపీ డీస్సీ పరీక్షలు 2 వారాల పాటు వాయిదాపడ్డాయి. దీనికి సంబంధించి మంత్రి గంటా శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. డీఎస్సీ రాయబోయే అభ్యర్థుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డీఎస్సీ ప్రకటనకు, ఎగ్జామ్ కు మధ్య గ్యాప్ తక్కువగా ఉండటంతో చదువుకోవడానికి సమయం కావాలంటూ అభ్యర్థులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబుతో చర్చించి డీఎస్సీ పరీక్షను 2 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి గంటా శ్రీనివాసరావు.

తొలి షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 6న డీఎస్సీ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అయితే రెండు వారాల పాటు వాయిదా వేయడంతో కొత్త షెడ్యూల్ ఇంకా ఖరారు చేయలేదు. బుధవారం నాడు ఆ వివరాలు ప్రకటించే ఛాన్సుంది. 7,729 పోస్టులకు గాను 6 లక్షల 8వేల 157 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. డీఎస్సీ పరీక్ష ఆఫ్‌లైన్‌ లేదంటే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారా అనే విషయం తేలలేదు. దీనిపై ఉన్నతాధికారులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

AP DSC examinations were postponed for 2 weeks

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+