జగన్పై పవన్ మరోసారి ఫైర్: ఈ సారి హామీలు అంటూ ట్వీట్
ఏపీ సీఎం జగనపై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శల జడివాన కొనసాగుతోంది. ఇటీవల రిపబ్లిక్ మూవీ ఫంక్షన్లో చేసిన కామెంట్లపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. దానికి కాసేపటి క్రితమే పోసాని కృష్ణమురళి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. అదీ అయ్యిందో లేదో.. పవన్ కల్యాణ్ మరోసారి ఫైరయ్యారు. జగన్ లక్ష్యంగా విమర్శలు కొనసాగించారు.

పవన్ పోస్ట్
రెండురోజుల క్రింద రిపబ్లిక్ సినిమా ఫంక్షన్కు వచ్చి.. సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయాలపై పవన్ కల్యాణ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి ట్విట్టర్ వేదికగా కౌంటర్ వేశారు. అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు అమలుకావడం లేదని ఫొటో రూపంలో పోస్టు చేశారు. మద్యపాన నిషేధం, ఉద్యోగాల భర్తీ, కరెంటు చార్జీలు, రాజధాని అంశం ఇలా వాగ్ధానాలను అందులో ప్రస్తావించారు. వాగ్దానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఏ ఒక్కదానిని అమలు చేయడం లేదని ఆరోపించారు.

అప్పుల కుప్ప
రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేసిందని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చాక చేపట్టిన చర్యలపై ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామనే హామీకి భిన్నంగా పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని చెప్పారు. అందువల్లే క్రైం రేట్ పెరుగుతుందని ఆయన విశదీకరించారు.

హామీలే..?
మద్యం ఆదాయాన్ని బ్యాంకుల నుంచి రుణాలను తీసుకునేందుకు ఉపయోగించుకుంటోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కరెంట్ చార్జీలను తగ్గిస్తామని, ట్రూ అప్ ద్వారా అదనపు భారాన్ని మోపుతుందని మండిపడ్డారు. ఏటా 6 వేల 500 పోలీసు ఉద్యోగాలను నోటిఫై చేస్తామని ఇప్పటివరకు 450 ఖాళీలను మాత్రమే గుర్తించిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులను కూడా 36కు పరిమితం చేసిందని, జాబ్ క్యాలెండర్, ఇసుక ధరలు, సంక్షేమ పథకాలు, నవరత్నాల పథకాల అమలు చేయడం లేదన్నారు. వాటన్నింటిపై ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభిస్తోందని విమర్శలు గుప్పించారు.

మోసం
అధికారంలోకి వచ్చేవరకు ఒకలా.. అధికారం చేపట్టిన తర్వాత జగన్ మరోలా బిహెవ్ చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పేద ప్రజల మేలును ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమం పేరుతో మోసాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలు మరచి.. కొత్త కొత్తవి అమలు చేస్తామని చెప్పి మోసం చేయడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లుతుందని చెప్పారు.
-
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రిలీజ్.. -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా.. టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications