భువనేశ్వరి రియాక్షన్: దిగజారిన వారు ఏమైనా మాట్లాడుతారు.. చంద్రబాబుతో సతీమణి
నారా భువనేశ్వరిపై చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు, నందమూరి కుటుంబం ముక్తకంఠంతో ఖండించాయి. అయితే తొలిసారి భువనేశ్వరి స్పందించారు. బాబు ఏడ్వడాన్ని చూసి భువనేశ్వరి కూడా ఇంట్లో భోరున విలపించారని సమాచారం. ఈ క్రమంలో ప్రెస్ మీట్ అవ్వగానే ఇంటికి వెళ్లిన చంద్రబాబు, నారా లోకేశ్ను చూసి ఆమె మరింత ఏడ్చారని అంటున్నారు. ఆ తర్వాత వెంటనే కోలుకున్న ఆమె.. జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దని తన భర్తకు చెప్పినట్టు సమాచారం.

దిగజారి..
దిగజారిన మనుషులు ఏవైనా మాట్లాడతారని భువనేశ్వరి అన్నట్టు సమాచారం. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయాలని సూచించారట. రాజకీయాల్లో ఒక్కోసారి ఇలాంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్న గారి హయాంలో కొందరు అలాగే మాట్లాడేవారున్నారు. చాలా నీచంగా మాట్లాడారు. బాధపెట్టడానికే ఇలాంటివి మాట్లాడుతారు. మనసుకు బాధనిపిస్తుందని వివరించారు. అలాంటి వాటిని పట్టించుకోవద్దని సూచించారు. పక్కకు పడేసి మన పని మనం చేసుకుపోవాలని భర్తను అనునయించారని తెలుస్తోంది.

వెక్కి వెక్కి ఏడ్చిన భువనేశ్వరి
అసెంబ్లీ పరిణామాల తర్వాత మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. తన భార్యపై అసభ్యంగా మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ సీఎం అయ్యే దాకా అసెంబ్లీలో అడుగు పెట్టనని ప్రతినబూనారు. ఆ ఘటనపై నందమూరి ఫ్యామిలీ మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖబడ్దార్ అంటూ బాలకృష్ణ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నారా రోహిత్ సహా అందరూ పెదవి విప్పారు.

సరికాదు..
నారా భువనేశ్వరికి జరిగిన అవమానంపై అన్నీ పార్టీల నేతలు, ప్రతినిధులు స్పందిస్తున్నారు. వైసీపీ నేతల తీరును తప్పుపడుతున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా రియాక్ట్ అయ్యారు. భువనేశ్వరికి జరిగిన అవమానం భూదేవికి జరిగినట్లేనని రఘురామకృష్ణరాజు కామెంట్ చేశారు. వైసీపీ నేతల నీచపు మాటలతో నందమూరి కుటుంబం ఎంత తల్లడిల్లిపోయిందో చూశామని అన్నారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటన కేవలం ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించినది కాదని... మొత్తం తెలుగుజాతికి జరిగిన అవమానమని చెప్పారు.

అలా అనలేదే..
భువనేశ్వరి కామెంట్స్కు సంబంధించి సర్వత్రా చర్చ జరుగుతుంది. టీడీపీ శ్రేణుల ఆందోళనలు మిన్నంటాయి. దీంతో వైసీపీ స్పందించింది. వారు అలా అనలేదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అలా కామెంట్ చేస్తే సీఎం జగన్ ఊరుకోరని స్పష్టంచేశారు. దీంతో తమ పార్టీ నేతలను వెనకెసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ మహిళపై కామెంట్స్ను మాత్రం తెలుగు సమాజం ఒకవిధంగా జీర్ణించుకోలేకపోతుంది.
-
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications