బాబు ఆత్మీయ సమ్మేళనం: ‘కాకినాడ’లో టీడీపీకి 12కులాల మద్దతు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం కాకినాడలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ వర్గాలకు చెందిన నేతలు, ప్రజలు పాల్గొన్న ఈ ప్రత్యేక భేటీలో ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు.
తూర్పుగోదావరి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం కాకినాడలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ వర్గాలకు చెందిన నేతలు, ప్రజలు పాల్గొన్న ఈ ప్రత్యేక భేటీలో ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. అమలవుతున్న పథకాల గురించి అడిగి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
టీడీపీకి 12కుల సంఘాల మద్దతు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వివిధ కుల సంఘాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించాయి. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన 12కులలాకు చెందిన నేతలు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి మద్దతిస్తామని తెలిపారు.
చంద్రబాబు ఒక్కో కుల సంఘం నేతలతో విడివిడిగా భేటీ అయిన చంద్రబాబు.. అన్ని వర్గాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలున పైకి తీసుకొచ్చి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పని చేస్తోందన్నారు.