ఏపీలో స్థిరంగా కొత్త కరోనా కేసులు: తగ్గిన రికవరీ, పెరిగిన యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా కేసులివే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా 3వేలకు దిగవనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 88,149 నమూనాలను పరీక్షించగా.. 2498 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు: యాక్టివ్ కేసులు కూడా, జిల్లాల వారీగా కేసులివే
ఏపీలో కొత్తగా 2498 కరోనా కేసులు, 24 మంది మృతి
తాజాగా నమోదైన 2498 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,44,222కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 24 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మరణించగా, ప్రకాశంలో నలుగురు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,178 మృతి చెందారు.
ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 23వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 2,201 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,07,201కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 23,843 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,37,52,356 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 481 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలులో 24 మంది కరోనా బారినపడ్డారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులివే
ఏపీలో
జిల్లాల
వారీగా
కొత్త
కరోనా
కేసులు
పరిశీలించినట్లయితే..
అనంతపురంలో
73,
చిత్తూరులో
245,
తూర్పుగోదావరిలో
481,
గుంటూరులో
181,
కడపలో
68,
కృష్ణాలో
263,
కర్నూలులో
24,
నెల్లూరులో
233,
ప్రకాశంలో
336,
శ్రీకాకుళంలో
56,
విశాఖపట్నంలో
179,
విజయనగరంలో
33,
పశ్చిమగోదావరిలో
326
కరోనా
కేసులు
నమోదయ్యాయి.
ఇప్పటి
వరకు
అత్యధిక
పాజిటివ్
కేసులు
నమోదైన
జిల్లాలను
గమనించినట్లయితే..
తూర్పుగోదావరిలో
2,73,914,
చిత్తూరులో
2,27,593
కేసులు
నమోదయ్యాయి.
అనంతపురం,
గుంటూరు,
కర్నూలు,
నెల్లూరు,
ప్రకాశం,
శ్రీకాకుళం,
విశాఖపట్నం,
పశ్చిమగోదావరి
జిల్లాల్లో
కరోనా
పాజిటివ్
కేసులు
లక్షకుపైగా
ఉన్నాయి.
కాగా,
ఒక్క
విజయనగరం
జిల్లాలోనే
లక్షకు
దిగువగా(81,159)
కరోనా
కేసులున్నాయి.