మరో స్నేక్ గ్యాంగ్!: బాయ్ఫ్రెండ్ ఎదుట యువతిపై గ్యాంగ్ రేప్, వీడియో తీసి...
హైదరాబాద్: రాజధాని హైదరాబాదులో మరో దారుణం జరిగింది. స్నేహితుడి కళ్ల ముందే ఓ యువతి పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిని బెదిరించి మరీ సామూహిక అత్యాచారం చేశారు. పెద్ద అంబరుపేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
నగరానికి చెందిన 22 ఏళ్ల యువతి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి వెళ్లింది. అక్కడ వారిద్దరే ఉండటాన్ని గమనించిన శ్రీనివాస్ రెడ్డి, లింగారెడ్డి అనే యువకులు వారి వద్దకు వెళ్లి, పోలీసు ఇన్ఫార్లమని చెప్పి అడ్డుకున్నారు. అది నిర్మానుష్య ప్రాంతం.
వారిద్దరు కలిసి ఆ యువకుడిని కొట్టారు. ఆ తర్వాత యువతి పైన అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె ఫోన్ నుండి నంబర్ తీసుకున్నారు. బాయ్ ఫ్రెండ్, యువతి సన్నిహితంగా ఉన్న చిత్రాలను సెల్ ఫోన్లో బందించామని, తాము ఎప్పుడు పిలిచినా రావాలని బెదిరించారు. వారు ఒకరి తర్వాత ఒకరు ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారు.
లేకుంటే ఆ చిత్రాలను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. వారి తీరుతో భయాందోళనకు గురైన యువతీ యువకులు మొదట పోలీసులను ఆశ్రయించలేదు. నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం విషయం తెలుసుకున్న హయత్ నగర్ పోలీసులు బాధితురాలిని సంప్రదించారు.
అయితే, విషయం చెప్పేందుకు ఆమె ససేమీరా ఒప్పుకోలేదు. కేసు ప్రాధాన్యం దృష్ట్యా పోలీసులు ఆమెను అనునయించి ఫిర్యాదు తీసుకున్నారు. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా.. నిందితులను ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. వారు నేరం అంగీకరించారని తెలుస్తోంది.
వారి సెల్ఫోన్లను తనిఖీ చేయగా అఘాయిత్యానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ఏవీ లభించలేదని, వాటిని తొలగించి ఉంటారనే ఉద్దేశ్యంతో ఆ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తున్నారని తెలుస్తోంది.
అఘాయిత్యానికి పాల్పడిన దుండగుల ఆమెకు మరోసారి ఫోన్ చేసి వేధింపులకు దిగడంతో విషయం పోలీసులకు తెలిసినట్లుగా ప్రచారం సాగుతోంది. నిందితుల పైన నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నారు.
అత్యాచారానికి పాల్పడిన వారు తమ గురించి ఎవరికైనా చెప్పినా, తాము పిలిచినప్పుడు రాకపోయినా తమ వద్ద ఉన్న వీడియోలు ఇంటర్నెట్లో పెడతామని, మీ పేరెంట్స్కు చూపిస్తామని బెదిరించారు. నిందితులకు గతంలో క్రైం బ్యాక్ గ్రౌండ్ ఉండి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.