వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్నంటే..?, యాక్టివ్ కేసుల్లో పెరుగుదల

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 23,417 నమూనాలను పరీక్షించగా.. 261 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,92,269కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

32. 36.. వేర్వేరు చోట్ల విద్యార్థులకు కరోనా వైరస్.. 32. 36.. వేర్వేరు చోట్ల విద్యార్థులకు కరోనా వైరస్..

ఏపీలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు

ఏపీలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో కరోనా బారినపడి ఎవరూ మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7185 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 125 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,83,505కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1579 యాక్టివ్ కేసులున్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు..

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు..

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,45,80,783 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 25, చిత్తూరులో 37, తూర్పుగోదావరిలో 28, గుంటూరులో 41, కడపలో 10, కృష్ణాలో 34, కర్నూలులో 20, నెల్లూరులో 11, ప్రకాశంలో 7, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 39,

విజయనగరంలో 0, పశ్చిమగోదావరిలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశ వ్యాప్తంగా తగ్గినా.. మహారాష్ట్రలో భారీగా కేసులు

దేశ వ్యాప్తంగా తగ్గినా.. మహారాష్ట్రలో భారీగా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 26వేలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదవగా.. సోమవారం మాత్రం కాస్త తగ్గాయి. సోమవారం 24,492 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,09,831కి చేరింది. కొత్తగా 20,191 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1,10,27,543కి చేరింది. 96.65గా నమోదైంది. గత 24 గంటల్లో 131 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,58,856కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,23,432 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే గడిచిన 24గంటల్లో 15వేల కొత్త కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో నమోదైన యాక్టివ్ కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం టీకా అందినవారి సంఖ్య 3,29,47,432కి చేరింది.

English summary
261 new corona cases reported in andhra pradesh: No death in last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X