కేజీహెచ్లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన (ఫోటోలు)
అమరావతి: కింగ్ జార్జి ఆసుపత్రి ఆవరణలో పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న చిన్నపిల్లల అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్న 28 రోజుల వయసున్న ఆడ శిశువు మృతిచెందడం వివాదానికి దారి తీసింది. రక్తం ఎక్కించిన కొద్దిసేపటికే ఆ చిన్నారి ఆరోగ్యం విషమించిందని, విధి నిర్వహణలో ఉన్న నర్సు దృష్టికి ఈ అంశం తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో గురువారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచిందని శిశువు తల్లిదండ్రులు ఆరోపించారు.
తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆసుపత్రి నర్పు నిర్లక్ష్యంపై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, విజయనగరం జిల్లా గరివిడి మండలం తాడిగుడ గ్రామానికి చెందిన సౌందర్యకు డిసెంబర్ 11న విజయనగరం ఘాషాసుపత్రిలో ప్రసవమైంది. ఆమెకు పండంటి ఆడబిడ్డ పుట్టింది.

కేజీహెచ్లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన
అయితే ఆ శిశువు ఉమ్మనీరు తాగడం వల్ల పుట్టగానే అస్వస్థతకు గురైంది. దంతో బిడ్డను విజయవనగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి, ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద వైద్యం చేయించినట్లు తల్లి చెప్పారు. డిసెంబర్ 29 వరకూ వైద్యం చేయించిన తర్వాత ఇంటికి తీసుకెళ్లామని, ఆ తర్వాత బిడ్డ కాలికి ఇన్ఫెక్షన్ రావడంతో ఈనెల 4న కేజీహెచ్లో చేర్పించామన చెప్పారు.

కేజీహెచ్లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన
5న ఆసుపత్రిలో బిడ్డకు ఆపరేషన్ చేశారని, 6న తేదీ రాత్రి రక్తం ఎక్కించారన్నారు. రక్తం ఎక్కించిన తర్వాత బిడ్డ ఆరోగ్య స్థితి ఒక్కసారిగా విషమించిందని, వెంటనే విధి నిర్వహణలో ఉన్న నర్సును ఆప్రమత్తం చేశామని, అయినా ఆమె పట్టించుకోలేదని తల్లి సౌందర్య ఆరోపించారు.

కేజీహెచ్లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన
రక్తం ఎక్కించే చోట పాప చెయ్యి వాచిపోయందని, తెల్లవారుజాము నుంచి ఎగ ఊపిరి వ్చచి బిడ్డ మృతి చెందిందన్నారు. తమ బిడ్డను చూసేందుకు వైద్యులు కూడా రాలేదని ఆమె ఆరోపించారు. మృతి చెందిన తర్వాత వైద్యులు హడావుడిగా వచ్చి చచ్చిపోయిందని చెప్పారన్నారు.

కేజీహెచ్లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన
కేవలం కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంగా తన బిడ్డ విగతజీవిగా మారిందని, దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు. పాప తండ్రి శివరామ్ ఈ మేరకు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆసుపత్రిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ను చిన్నారి తల్లిదండ్రులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

కేజీహెచ్లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన
దీనికి ఆయన మాట్లాడుతూ ఘటనపై విచారణ చేయిస్తామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలను తీసుకంటామన్నారు. దీనిపై ఆసుపత్రి సూపరిడెంట్ స్పందించారు. 'సెప్టిసేమియా' అనే వ్యాధితో బాధపడుతూ బిడ్డ ఆసుపత్రిలో చేరిందని, అవసరమైన వైద్య అందించామని చెప్పారు.

కేజీహెచ్లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన
అయితే నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఫిర్యాదు వచ్చిందని, దీనిపై విచారణకు డాక్టర్ అర్జున ఆధ్వర్యంలో ముగ్గురు సీనియర్ వైద్యులతో కమిటీ వేస్తున్నామని ఆయన చెప్పారు. విచారణ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలను తీసుకుంటామని ఆయన చెప్పారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications