విశాఖ: ఈతకు వెళ్లి ముగ్గురు మృతి, వ్యభిచార ముఠా గుట్టురట్టు
విశాఖపట్నం: నగరంలోని జోగుళ్లపాలెం బీచ్లో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఎండ వేడిమి భరించ లేకే మధ్యాహ్నాం ఒంటి గంట సమయంలో సముద్ర స్నానానికి వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తం సముద్ర స్నానానికి వెళ్లిన 10 మందిలో ముగ్గురు మృతి చెందారు.
గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ఇద్దరిని స్థానికులు రక్షించగా, ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతులు లోకేష్, రాజు, విజయ్లుగా పోలీసులు గుర్తించారు.
వ్యభిచార ముఠా గుట్టురట్టు
నగరంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తోన్న ఓ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు బయట పెట్టారు. రామా టాకీస్ దగ్గర టాస్క్ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాల్లో ఈ వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన వారిలో ఇద్దరు విటులు, ఒక యువతితో పాటు నిర్వాహకురాలు ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.17వేలు స్వాధీనం చేసుకున్నారు.
మావోలు, పోలీసులకు మధ్య కాల్పులు
విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య గురువారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం తీగలమెట్ట అడవిలో రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఎదురుకాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. గురువారం కూడా కొయ్యూరు మండలం చీడిపల్లి అటవీ ప్రాంతంలో 15 రౌండ్లు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే.