సీమాంధ్ర రాజధానికి మూడు ప్రాంతాల ఎంపిక?

మూడోదిగా గుంటూరు జిల్లాలోని మాచర్లను పేర్కొన్నట్టు సమాచారం. ఈ మూడు చోట్ల తగినంత అటవీ స్థలాలు ఉన్నాయి కనుక భూసేకరణ సమస్య ఉండదని ప్రభుత్వ అభిప్రాయం. అటవీ సంరక్షణ చట్టాల నుంచి వాటిని డీనోటిఫై చేస్తే చాలునని, దానివల్ల స్థలం సమస్య రాదని భావిస్తున్నారు. 1.25 లక్షల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేస్తే సరిపోతుందని అంచనా వేస్తున్నారు. అయితే, స్పష్టంగా ప్రాంతాలను ఎంపిక చేయలేదు. రాజధాని గుర్తింపునకు నిపుణుల కమిటీని వేయాలని నిర్ణయించింది
ప్రస్తుతం పరిగణనలో ఉన్నాయని భావిస్తున్న మూడు ప్రాంతాల్లో మార్కాపురం విజయవాడ - బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో ఉంది. నీటి వసతికి శ్రీశైలం, గుండ్లకమ్మ ప్రాజెక్టులు ఉన్నాయి. పైగా రాయలసీమకూ దగ్గరగా ఉంది. మాచర్ల ప్రాంతం అయితే, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి అవసరాలు తీర్చుకోవచ్చు. హైదరాబాద్-గుంటూరు మధ్య జాతీయ రహదారి, రైల్వేలైన్ ఉండడం కలిసి వస్తాయి.
కాకినాడకు సమీపంలోనూ అటవీ భూములు ఉన్నాయి. గోదావరి నీటి వసతి అందుబాటులో ఉంది. హౌరా-చెన్నై జాతీయ రహదారి మార్గంలో ఉంది. అయితే, వీటిలో ఏ ఒక్కదానికీ విమానాశ్రయం లేదు. స్థానికంగా చిన్నపాటి విమానాశ్రయాలు ఏర్పాటు చేసి 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications