ఏపీలో కరోనా విలయతాండం.. ఒక్కరోజులో 4,348 కొత్త కేసులు.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకు వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. గడిచిన 24 గంటల్లో 4,348 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. దీంతో యాక్టివ్ కేసులు సంఖ్య 14,204కి చేరింది. ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు చిత్తూరు జిల్లాలో 932 నమోదయ్యాయి. బుధవారంతో పాలిస్తే దాదాపు 1,143 కొత్త కేసులు వచ్చాయి.
కరోనా విస్పోటనం .
ఏపీలో కరోనా విలయంతాండం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 47,884 శాంపిల్స్ పరీక్షించగా 4,348 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. బుధవారంతో పోలిస్తే 1,143 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న మొత్తం 3,205 పాజిటివ్ కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో 261 మంది కరోనా నుంచి కోలుకోగా.. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 14,507కి చేరింది.
ఇద్దరు మృతి
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 20,89,333 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,60,621 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 14,204 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. బుధవారంతో పోల్చితే దాదాపు అన్ని జిల్లాల్లో కేసులు రెట్టింపు అయ్యాయి. ఇద్దరు మృతి చెందారు.. వేగంగా పెరుగుతున్న వైరస్ వ్యాప్తితో జనం భయాందోళనకు గురవుతున్నారు.
చిత్తూరులో వైరస్ ప్రళయం
కరోనా వ్యాప్తి జిల్లాల్లో రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 932 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. తర్వాత విశాఖపట్నం 823, నెల్లూరు 395, గుంటూరు 338, కృష్ణా 296, విజయనగరం 290 మంది కరోనా బారిన పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 259, తూర్పుగోదావరి 247, అనంతపురం 230, కడప 174, కర్నూలు 171, ప్రకాశం 107, పశ్చిమగోదావరి జిల్లాలో 86 పాజిటివ్ కేసులు వచ్చాయి.
కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు..
కరోనాను ప్రజలు తేలిగ్గా తీసుకోవద్దని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడం , మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. కరోనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. రానున్న రోజుల్లో కరోనా కేసులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.