శుభవార్త: ఏపీలో ఆ ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంపు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి జీతాలు 50 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలను ఈ మేరకు పెంచింది.
అమరావతి: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి జీతాలు 50 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలను ఈ మేరకు పెంచింది.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతన పెంపుపై గత నెల 15న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరం వారికి వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఇప్పుడు చెల్లిస్తున్న వేతనాలపై మరో 50 శాతం వేతనాలు పెంచుతూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిప్రకారం ఒప్పంద ఉద్యోగుల్లో ఎవరికీ నెలకు రూ.12వేలకు తక్కువ కాకుండా వేతనం చెల్లిస్తారు.

వేతనం పెంపు కేవలం కన్సాలిడేటెడ్ మొత్తం మీద మాత్రమే పెంచామని, వారికి ఎలాంటి ఇతరత్రా అలవెన్సులు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలాగే ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వంలో ఏ శాఖలోనూ కూడా ఇకపై ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఒప్పంద ఉద్యోగులను నియమించుకోరాదని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications