క్షుద్రపూజలతో గదిలో నిర్బంధం, బాలికకు వాతలు

అమావాస్య నాడు పుట్టిందని, ఇది అరిష్ట మని ఓ బంధువు ఆ బాలిక తల్లిదండ్రులను భయపెట్టాడు. దాంతో క్షుద్రపూజల పేరిట 20 రోజులపాటు బాలికను నిర్బంధించాడు. వంటిపై పలుచోట్ల వాతలు పెట్టాడు. తట్లు తేలేలా కొట్టాడు. మెడపై కోశాడు. పళ్ల గాట్లు పెట్టాడు. పాదాలను నలిపేశాడు. చిత్రహింసలు పెట్టి నరకం చూపించాడు.
అతనికి తల్లి దండ్రులు సహకరించారు. విషయం తెలుసుకున్న బాలిక అమ్మమ్మ, తాతయ్య బాలికను తీసువచ్చేడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సంఘటన తూర్పు గోదావరి జిల్లా కొండవరం గ్రామంలో జరిగింది.
ఇరుగుపొరుగువారు విషయాన్ని పిఠాపురం పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి బాలికను విడిపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications