వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Diwali 2022: టపాసులు పేలి బాలుడు మృతి.. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి పేషెంట్ల తాకిడి..

|
Google Oneindia TeluguNews

దీపావలి పండుగ అంటే మనకు మొదట గుర్తొచ్చేది టపాసులు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు టపాసులు పేల్చుతుంటారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బాణాసంచ పేలిస్తే ప్రమాదాలు జరుగుతాయి. తాజాగా ఏపీలోని మచిలీపట్నం శివారు నవీన్ మిట్టల్‌ కాలనీలో సీతానగర్‌లో టపాసులు పేలి 11 ఏళ్ల బాలుడు చనిపోయాడు.టపాసులు ఆరబెడుతుండగా అవి ఒక్కసారిగా పేలాయి. దీంతో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనంపై నిప్పులు పడటంతో ట్యాంక్ అంటుకుని వాహనానికి మంటలు అంటుకుని బాలుడి కాలిపోయాడు. బాలుడిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించిగా పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు.

50 కేసులు
ఇటు హైదరాబాద్ లో కూడా టపాసులు పేలి గాయపడ్డారు.బాణాసంచ పేల్చుతున్నప్పుడు గాయపడిన వారితో మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి కిటకిటాలడింది. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. సోమవారం రాత్రే 10 కేసులు హాస్పిటల్ కు వచ్చాయని అక్కడి సిబ్బంది తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం వరకు దాదాపు 50 కేసులు నమోదు కాగా.. 12 మందిని హాస్పిటల్ లో చేర్చుకుని చికిత్స చేస్తున్నారు.

A boy deid due to blast at machilipatnam in Andrapradhesh

నిర్లక్ష్యం
టపాసులు కాల్చుతూ గాయపడి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.టపాసులు పేల్చేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే.. తర్వాత ప్రమాదాలు తప్పవని చెబుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వం కంటీ, ఈఎన్టీ ఆస్పత్రుల్లో సిబ్బందిని అప్రమత్తం చేసింది.

English summary
Tapasulu are bursting from small children to adults. Exploding firecrackers without proper precautions can lead to accidents. Recently, an 11-year-old boy was killed in a tapas explosion in Sitanagar, a suburb of Machilipatnam in AP's Naveen Mittal Colony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X