టీవీ రిమోట్ కోసం గొడవపడి ఆత్మహత్య చేసుకుంది

తనకు ఇష్టమైన ఛానల్ చూడనివ్వడం లేదని చెల్లెలు మరియా ఫాతిమా (13) అక్కతో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అక్క రిమోట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఫాతిమా గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుంది.
కొన ఊపిరితో ఉందని గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే ఆమెను అమీర్పేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఫాతిమా మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.
అక్కా, చెల్లెళ్ల మధ్య టీవీ విషయంలో గతంలో కూడా పలుమార్లు ఇలాంటి వివాదాలు జరిగాయని, ఇంతదూరం వస్తుందని తాము అనుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications