నిర్లక్ష్యం: ధ్వంసమైన ఆంజనేయస్వామి ఆలయం
విజయవాడ: కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో గల ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూలిపోయింది. సోమవారం రాత్రి ఒక్కసారిగా కృష్ణా కాల్వ నీరు విడుదల చేయడంతో ఆంజనేయస్వామి విగ్రహంతో సహా ఆలయం ధ్వంసమైంది.
20రోజులుగా డెల్టా ఆధునీకరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే దేవాలయం ధ్వంసమైందని స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు ఒక్కసారిగా భారీగా విడుదల కావడంతో ఆంజనేయస్వామి ఆలయం ధ్వంసమైందని తెలిపారు.

మంగళవారం కావడంతో తెల్లవారుజామునే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. వారు వచ్చేసరికే ఆలయం పూర్తిగా ధ్వంసమై ఉండటంతో ఆందోళన చేపట్టారు. ఆలయ ధ్వంసం కావడానికి అధికారులు, ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. దేవాలయాన్ని పునర్నించేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు.
ఊరికి ఎలాంటి అరిష్టం కలగకుండా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసేందుకు భక్తులు ప్రయత్నాలు ప్రారంభించారు. చందాలు వేసుకుని ఈ ఆలయాన్ని నిర్మించామని స్థానికులు చెప్పారు. నీటిలో కొట్టుకుపోయిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనుకున్న సమయంలో ఇలా జరగడం విచారకరమని స్థానిక భక్తులు పేర్కొన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications