విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శీతలపానీయంలో కొడుకులకు విషమిచ్చి చంపిన తండ్రి

|
Google Oneindia TeluguNews

ప్రకాశం: జిల్లాలోని తాళ్లూరు మండలం విఠలాపురంలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కుమారులచేత పురుగుల మందు తాగించి చంపేశాడు ఓ తండ్రి. అనంతరం తానూ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. విఠలాపురం గ్రామానికి చెందిన కైపు వెంకటరెడ్డి కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం అతను తన ఇద్దరు కుమారులను పొలానికి తీసుకెళ్లి శీతలపానియంలో పురుగుల మందు కలిపి ఇచ్చాడు.

A man allegedly killed his sons

ఆ శీతలపానియాన్ని తాగిన పిల్లలు ఇంద్రసేనారెడ్డి(7), యశ్వంత్‌ రెడ్డి(5) అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలను చెట్టు కిందకు చేర్చిన వెంకటరెడ్డి అనంతరం పురుగులమందు తాగాడు. గమనించిన స్థానికులు వెంకటరెడ్డిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. వెంకటరెడ్డి మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.

English summary
A man allegedly killed his sons in Prakasam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X