దారుణం: అర్ధరాత్రి ఇంట్లోని భార్య, ఇద్దరు కూతుళ్లను చంపేశాడు
అనంతపురం: జిల్లాలోని తాడిపల్లి కృష్ణాపురంలో సోమవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న తన భార్య, ఇద్దరు కుమార్తెలను సుత్తితో మోది చంపేశాడో దుర్మార్గుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
సోమవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్య సులోచన(55), కుమార్తెలు ప్రసన్న(22), ప్రతిభలపై సుత్తితో దాడి చేశాడు రామసుబ్బారెడ్డి. దీంతో సులోచన, ప్రసన్న అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రతిభ మృతి చెందింది.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒకే కుటుంబంలో ముగ్గురు హత్యకు గురవడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, హత్యలు చేసిన అనంతరం రామసుబ్బారెడ్డి పరారయ్యాడు. కాగా, దాడి జరిగిన సమయంలో ఇంట్లో లేని మరో కూతురు ప్రత్యూష ప్రాణాలతో బయటపడింది.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సులోచన, రామసుబ్బారెడ్డి తరచూ గొడవపడుతుండేవారని, ఈ క్రమంలోనే అతడు హత్యలు చేసివుంటారని అనుమానిస్తున్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications