ప్రేమను మించిన కామం: రెండో పెళ్లి కోసం కన్న కొడుకునే చంపేసింది
తన సంతానాన్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తల్లే తన కుమారుడి పాలిట యముడిలా మారింది. కన్న కొడుకనే కనికరం కూడా లేకుండా అన్నంలో పురుగుల మందు కలిపి చంపేసింది. తన రెండో వివాహానికి అడ్డుగా ఉన్నాడనే ఈ వ
కృష్ణా: తన సంతానాన్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తల్లే తన కుమారుడి పాలిట యముడిలా మారింది. కన్న కొడుకనే కనికరం కూడా లేకుండా అన్నంలో పురుగుల మందు కలిపి చంపేసింది. తన రెండో వివాహానికి అడ్డుగా ఉన్నాడనే ఈ విధంగా ఆ తల్లి చేయడం విచారకరం.
ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం ముళ్లపాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొలుత తన కుమారుడు అశోక్ కుమార్(5) కనిపించడం లేదని సుజాత అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో మే 27వ తేదీన గ్రామంలోని ఓ బావిలో బాలుడి శవం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. విష ప్రయోగం జరిగినట్లు తేలింది. దీంతో బాలుడి తల్లి సుజాతను కస్టడీలోకి తీసుకుని విచారించారు.
దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన రెండో వివాహానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే తన కొడుకును చంపేసినట్లు ఆమె అంగీకరించింది. 8 నెలల క్రితం భర్త చనిపోవడంతో సుజాత.. మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో అతడ్ని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది.