దాష్టీకం: అప్పు కడతావా? అమ్మాయిని పంపుతావా?
అనంతపురం: అప్పు తీసుకున్న పాపానికి.. పేదరికంతోపాటు, బ్లడ్క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. అంతేగాక
అప్పుతీర్చలేకపోతే.. తన కూతురును పంపించాలని ఆమెపై ఒత్తిడి పెంచాడు.
అనంతపురానికి చెందిన మల్లేశ్ అనే వడ్డీ వ్యాపారి దుర్మార్గమిది. తన ఆరోగ్యంతోపాటు కుమారుడికి కిడ్నీ సమస్య కారణంగా మల్లేశ్ వద్ద బాధిత మహిళ రూ. 5 వేలు అప్పు తీసుకుంది.
సకాలంలో అప్పు చెల్లించలేకపోయింది.
దీన్ని ఆసరాగా చేసుకొని ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు ఎనిమిదో తరగతి చదువుతున్న ఆమె కూతురును తన వద్దకు పంపించాలని మల్లేశ్ వేధింపులకు పాల్పడ్డాడు.
మల్లేష్ వేధింపులు భరించలేక అనంతపురం ఎస్పీకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. అయితే ఎప్పీ ఆదేశించినా స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధిత మహిళకు మద్దతుగా
పలు విద్యార్థి సంఘాలు డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.