బోటు విషాదం: 22మంది ప్రాణాలు తీసింది అధికారుల నిర్లక్ష్యమే?(వీడియో)
కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
విజయవాడ: కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ప్రమాదానికి ముందు బోర్డింగ్ మేనేజర్ చేసిన వ్యాఖ్యలు అధికారుల నిర్లక్ష్య దోరణికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

అధికారి నిర్లక్ష్యం..
ప్రమాదానికి ముందు సదరు బోటును నిర్వాహకులు దుర్గా ఘాట్ వద్ద నిలిపారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న బోర్గింగ్ మేనేజర్ బోటుకు ఎటువంటి అనుమతులు లేవని తెలిసినప్పటికీ.. బోటును నిలువరించే ప్రయత్నం చేయలేదు.

ప్రమాదానికి ప్రధాన కారణం
అంతేగాక, బోటును ఈ ఘాట్ వద్ద నిలపొద్దని వేరే ఘాట్లో నిలుపుకోండంటూ బోటు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారే.. తప్ప తన బాధ్యతను మాత్రం మర్చిపోయారు. ఆ బోటుకు అనుమతి లేదని తెలిసినా.. సదరు అధికారి బోటును అడ్డుకోకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా మారింది.
అడ్డుకొనివుంటే.. 22మంది ప్రాణాలు..
ఒక వేళ సదరు అధికారి బోటును అప్పుడే నిలువరించి ఉంటే.. అసలు ఈ బోటు ప్రమాదం జరిగి ఉండేదే కాదు. 22మంది ప్రయాణికులు ప్రాణాల పోయి ఉండేవి కూడా కాదు. ఇంత మంది కుటుంబాల్లో విషాదం ఉండేదే కాదు. బోటు నిర్వాహకులు కూడా ప్రయాణికుల భద్రతను పట్టించుకోకుండా డబ్బులే లక్ష్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ పెను విషాదానికి కారణమయ్యారు.

పునరావృతం కాకూడదంటూ..
ఈ వీడియో చూసిన నెటిజన్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే 22మంది ప్రాణాలను బలితీసుకుందని మండిపడుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రయాణికుల భద్రతకు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హితబోధ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానిస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications