తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తల్లిని బంధించి 21రోజుల బాబును ఎత్తుకెళ్లిన మహిళ

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుపతి విద్యానగర్‌లో ఓ చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. ఇంట్లో ఉన్న తల్లిని బంధించి 21రోజుల బాబును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సదరు మహిళ కోసం గాలింపు చేపట్టారు.

A woman allegedly kidnapped a child

గుప్తనిధుల కోసం తవ్వకాలు

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో గుర్తుతెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. గ్రామంలోని తోట హనుమప్ప ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు విగ్రహాలను చిందరవందరగా పడేసి తవ్వకాలు చేశారు.

తవ్వకాలు జరపడానికి ముందు పూజలు నిర్వహించినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శనివారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

భార్య, అత్త, మామపై కత్తితో దాడి చేసిన అల్లుడు

తూర్పుగోదావరి: రాజోలులో దారుణం జరిగింది. ములికిపల్లిలో గణేష్‌ అనే వ్యక్తి తన భార్య, అత్త, మామపై కత్తితో దాడి చేశాడు. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు కుటుంబకలహాలే కారణమని స్థానికులు తెలిపారు.

English summary
A woman has allegedly kidnapped a child in Chittoor district on Saturday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X