నిత్య పెళ్ళికొడుకుపై భార్య ఫిర్యాదు, షాక్ తిన్న నలుగురు భార్యలు
ఒకరికి తెలియకుండా మరోకరిని బురిడీ కొట్టించి ఏకంగా నలుగురిని వివాహం చేసుకొన్నాడు ఓ ప్రబుద్దుడు.అయితే నాలుగో భార్యతో గొడవతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ నిత్య పెళ్ళికొడుకుపై బాధితురాలు పోలీసులకు పిర్యాదు చే
విశాఖపట్టణం: ఒకరికి తెలియకుండా మరోకరిని బురిడీ కొట్టించి ఏకంగా నలుగురిని వివాహం చేసుకొన్నాడు ఓ ప్రబుద్దుడు.అయితే నాలుగో భార్యతో గొడవతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ నిత్య పెళ్ళికొడుకుపై బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది.ఈ ఘటన విశాఖ జిల్లాలో వెలుగుచూసింది.
విశాఖపట్టణంలోని నరసింహనగర్ కు చెందిన జె. అరుణ్ కుమార్ న్యూ గరుడా ట్రావెల్స్ ను నిర్వహిస్తున్నాడు.ఆయన తన భార్య చనిపోయిందని చెప్పి శివాజీపాలెనికి చెందిన శ్యామలను 2015 లో వివాహం చేసుకొన్నాడు. వీరిద్దరికి ఓ పాప కూడ ఉంది.
వాహనం కొనుగోలు కోసం డబ్బులు కావాలని చెప్పి శ్యామల వద్ద రూ. 4 లక్షలను తీసుకొన్నాడు. ఆ తర్వాత తరచూ గొడవపడుతూ ఆమెను దూరం చేయడం మొదలుపెట్టాడు.

దీంతో అనుమానం వచ్చిన శ్యామల అరుణ్ కుమార్ గురించి ఆరా తీసింది. తనకంటే ముందే మరో ముగ్గురు మహిళలను పెళ్ళిచేసుకొన్నట్టు శ్యామల గుర్తించింది.ఈ విషయం తెలిసి ఆమె షాక్ కు గురైంది.
మొదటి భ్యారకు సంతానం కూడ ఉంది. రెండో భార్య చనిపోయింది. మూడో భార్యకు పాప ఉంది. తనను నాలుగో పెళ్ళి చేసుకొని నట్టేట ముంచాడని శ్యామల భోరున విలపించింది. పోలీసులను ఆశ్రయించింది.
మహిళల జీవితాలతో ఆటలు ఆడుకొంటున్న అరుణ్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆమె కోరుతోంది. ఈ మకేసు మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తోందని అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు మహిళా పోలీసులకు శ్యామ ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications