పెళ్లి రోజే మహిళ ఆత్మహత్య: భర్తపై అనుమానం

A woman suicides in Hyderabad
హైదరాబాద్: తమ పెళ్లి రోజు ఆనందంగా గడపాల్సిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఈ విషాధ ఘటన సోమవారం అర్ధరాత్రి నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో ఉండే నరేందర్ రెడ్డి డిసిఎం డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిత్యం తప్పతాగి ఇంటికి వచ్చి భార్య(26)ను వేధించేవాడు. వీరికి ఎనిమిదేళ్ల కతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.

సోమవారం వారి పెళ్లి రోజు. ఆ రోజైనా తన భర్త తాగకుండా వస్తాడని రాధ రాత్రి వరకు గుమ్మం వద్దే వేచి చూసింది. రాత్రి 11 గంటలకు మద్యం మత్తులో తూలుతూ ఇంటికి వచ్చాడు నరేందర్ రెడ్డి. దీంతో పెళ్లి రోజైనా తాగకుండా ఉండలేవా అని ఆమె తన భర్తతో గొడవ పడింది. మద్యం మత్తులో ఉన్న నరేందర్ రెడ్డి ఆమెను కొట్టడంతో మనస్తాపానికి గురైన రాధ ఆత్మహత్యకు పాల్పడింది.

ఇది గమనించిన నరేందర్ రెడ్డి.. రాధ మృతదేహాన్ని కిందకు దింపి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన గుర్తించిన బంధువులు, స్థానికులు నరేందర్ రెడ్డికి దేహశుద్ధి చేయడంతో అసలు విషయం చెప్పాడు.

అయితే రాధను భర్తే హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతురాలి భర్త నరేందర్ రెడ్డితోపాటు అత్తామామలు విమలమ్మ(45), నాగిరెడ్డి(50)లను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+