హృదయవిదారకం: తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టిన సోదరి
కృష్ణా/ఖమ్మం: రాఖీ పండుగ ఓ ఇంట తీరని విషాదం నింపింది. ఓ ప్రమాదంలో సోదరుడు చనిపోగా.. అతని సోదరి కన్నీటితో అతడి మృతదేహానికి రాఖీ కట్టింది. ఈ ఘటన అక్కడున్న వారందర్నీ కంటతడి పెట్టించింది.
ఘటనకుసంబంధించిన వివరాలా ఉన్నాయి.. ఆదివారం సాయంత్రం సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులోకి ఓ కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో గల్లంతయిన కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కొక్కొండ వినోద్ (22) మృతదేహాన్ని సోమవారం ఉదయం గుర్తించారు.

వినోద్ కొందరు మిత్రులతో కలిసి ఈ చెరువు వద్ద స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు వచ్చినపుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎనిమిదిమంది జాలర్లు గాలించి అతడి మృతదేహాన్ని వెలికి తీశారు.
అతడి శవాన్ని చూడడంతోనే తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల శోకం మిన్నంటింది. రాఖీ పండగ కావడంతో అతని సోదరి శిరీష తీరని దుఃఖంతో విలపిస్తూనే వినోద్ మృతదేహానికి రాఖీ కట్టడం అక్కడున్న కంటతడిపెట్టించింది. వినోద్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications