Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంజామల విషాదంలో విచిత్రం: మార్చురీలో లేచి కూర్చున్న మహిళ

కర్నూలు: జిల్లా సంజామల మండలంలోని మిక్కినేనిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి ఆ నలుగురి మృతదేహాలను తరలించారు.

అయితే, ఆస్పత్రి మార్చురీలో నలుగురి మృతదేహాలు ఉంచగా.. మద్దమ్మ(70) అనే మహిళ లేచి కూర్చుంది. అప్పటి వరకు చనిపోయిందనుకున్న మహిళ లేచి కూర్చుండటంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

A woman wake up and seated in Mortuary

కాగా, విద్యుత్ షాక్ కారణంగా కోమాలోకి వెళ్లి.. ఇప్పుడే స్పృహలోకి వచ్చి ఉంటుందని వైద్యులు తెలిపారు. మద్దమ్మ తిరిగి లేవడంతో ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన మద్దమ్మ మనవరాలు రజితను కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు.

ఈ విద్యుత్ షాక్ ఘటనలో సుకూర్‌ భాషా(35), ఉప్పరి సుధాకర్‌(20), ప్రవల్లిక(11) ప్రాణాలు కోల్పోయారు. మిక్కినేనిపల్లి గ్రామానికి చెందిన ఈ ఐదుగురు రైతులు తమ పంట పొలానికి వెళుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. అడవి పందులు రాకుండా పొలాల చుట్టూ ఏర్పాటు చేసిన కంచెకు విద్యుత్తు సరఫరా కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+