సంజామల విషాదంలో విచిత్రం: మార్చురీలో లేచి కూర్చున్న మహిళ
కర్నూలు: జిల్లా సంజామల మండలంలోని మిక్కినేనిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి ఆ నలుగురి మృతదేహాలను తరలించారు.
అయితే, ఆస్పత్రి మార్చురీలో నలుగురి మృతదేహాలు ఉంచగా.. మద్దమ్మ(70) అనే మహిళ లేచి కూర్చుంది. అప్పటి వరకు చనిపోయిందనుకున్న మహిళ లేచి కూర్చుండటంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

కాగా, విద్యుత్ షాక్ కారణంగా కోమాలోకి వెళ్లి.. ఇప్పుడే స్పృహలోకి వచ్చి ఉంటుందని వైద్యులు తెలిపారు. మద్దమ్మ తిరిగి లేవడంతో ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన మద్దమ్మ మనవరాలు రజితను కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు.
ఈ విద్యుత్ షాక్ ఘటనలో సుకూర్ భాషా(35), ఉప్పరి సుధాకర్(20), ప్రవల్లిక(11) ప్రాణాలు కోల్పోయారు. మిక్కినేనిపల్లి గ్రామానికి చెందిన ఈ ఐదుగురు రైతులు తమ పంట పొలానికి వెళుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. అడవి పందులు రాకుండా పొలాల చుట్టూ ఏర్పాటు చేసిన కంచెకు విద్యుత్తు సరఫరా కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications