బీటెక్ విద్యార్థికి షాక్: ఆన్లైన్లో ల్యాప్టాప్ కొంటే.. రాళ్లు, రోటీ ముక్కలు వచ్చాయి!
పశ్చిమ గోదావరి: ఆన్లైన్లో ల్యాప్టాప్ ఆర్డర్ చేసిన ఓ బీటెక్ విద్యార్థి.. తనకు వచ్చిన బాక్సును తెరిచి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అందులో ల్యాప్టాప్కు బదులు రాళ్లు(టైల్స్), రొట్టె ముక్క ఉండటమే ఇందుకు కారణం.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలోని పోణంగి రోడ్డులో ఉంటున్న కొలుసు తారకరామ్ బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. నవంబర్ 12న అతను లెనోవా కంపెనీ ల్యాప్టాప్ను (మోడల్ నెంబరు 5080) పేటీఎంలో బుక్ చేశారు.

ఇందుకోసం రూ.31,940 ఆన్లైన్లో జమ చేశాడు. బుధవారం బ్లూడాట్ కొరియర్ ద్వారా అతనికి పార్శిల్ అందింది. దాన్ని తెరచి చూడగా ల్యాప్టాప్ పరిమాణంలో ఉన్న రెండు రాళ్లు (టైల్స్), కొన్ని చపాతీ ముక్కలు బయటపడ్డాయి.
ఒక్కసారిగా కంగుతిన్న బాధితుడు తారకరామ్.. కంపెనీ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయగా అటు నుంచి సమాధానం రాలేదు. దీంతో బాధితుడు ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. తనకు న్యాయం చేయాలని వినియోగదారుల ఫోరంంలో ఫిర్యాదు చేస్తానని బాధితుడు తారకరామ్ చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications