ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు: తీరా పెళ్లి సమాయానికి ఉడాయించాడు

విశాఖపట్నం: ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. అంతేగాక, తను ప్రేమించిన యువతి తల్లిదండ్రులను కూడా తమ పెళ్లికి ఒప్పించాడు. ఇప్పటి దాకా బాగానే ఉంది. అయితే మరో కొద్ది గంటల్లో వారి వివాహం జరుగుతుందనగా, పెళ్లి మండపం నుంచి పరారయ్యాడు ఆ యువకుడు. ఈ పరిణామంతో వధువు కుటుంబసభ్యులు దిగ్ర్బాంతికి గురయ్యారు.

ఈ ఘటన విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం రామన్నపాలెంకు చెందిన యువకుడు మాటూరుకు చెందిన సదరు యువతి ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు.

A youth left his lover in wedding hall

ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల వారు పెళ్లికి అంగీకరించి, ఆహ్వాన పత్రాలతోపాటు అన్ని సిద్ధం చేసుకున్నారు. గురువారం అన్నవరంలో వీరిద్దరికి వివాహాం జరిపించడానికి పెద్దలు ఏర్పాట్లు కూడా చేశారు.

బయటకు వెళ్లి వస్తానని చెప్పిన ఆ యువకుడు సాయంత్రం వరకు తిరిగిరాలేదు. దీంతో యువతి అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+