రూ.500 కోట్ల ఆస్తులు: బయట తాళం వేసి ఇంట్లో, గాయత్రిని పట్టించిన ఏసీ
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రఘురామి రెడ్డి అక్రమాస్తుల కేసులో ఓ ఆసక్తికర విషయం. రఘు బినామీలు వెంకటశివప్రసాద్, గాయత్రి (వెంకటశివప్రసాద్ భార్య)లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
అమరావతి: టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రఘురామి రెడ్డి అక్రమాస్తుల కేసులో ఓ ఆసక్తికర విషయం. రఘు బినామీలు వెంకటశివప్రసాద్, గాయత్రి (వెంకటశివప్రసాద్ భార్య)లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
చదవండి: ఏపీలో రూ.500 కోట్ల అవినీతి: ప్రేమ-పెళ్లి-అక్రమాలు, ఎవరీ రఘు, ప్రసాద్, గాయత్రి?

బయట తాళం వేసి లోపల ఉన్న గాయత్రి
సోదాల సమయంలో ఏసీబీ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు గాయత్రి ఇంటి బయట తాళం వేసి, ఇంటి లోపల దాక్కుంది. కానీ ఏసీ శబ్దం ఆమెను పట్టించింది. గాయత్రిని అదుపులోకి తీసుకునేందుకు మంగళవారం ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు వారి ఇంటికి వెళ్లాయి. తాళం వేసి ఉంది.
Recommended Video


అధికారులు గుళ్లోకి వెళ్లి కూర్చోగా..
చుట్టు పక్కల ఉన్నవాళ్లు, ఆ ఇంటి పని మనుషులను ఆరాతీయగా సోమవారం రాత్రే విజయవాడ వెళ్లిపోయారని చెప్పారు. అవాక్కైన ఏసీబీ అధికారులు పక్కనే ఉన్న షిర్డీ సాయిబాబా మందిరాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ కొంతసేపు కూర్చున్నారు. ఈ సమయంలో ఇంటిలోని ఓ గది నుంచి వారికి ఏసీ శబ్దం వినిపించింది.

సెల్ టవర్ పరిశీలించి.. ఆ తర్వాత అరెస్ట్
అప్రమత్తమైన ఏసీబీ అధికారులు గాయత్రి సెల్ టవర్ లొకేషన్ను తనిఖీ చేశారు. ఆమె ఇంట్లోనే ఉన్నట్లుగా గుర్తించారు. ఆమె ఇంట్లోనే ఉందని నిర్ధరించుకుని నేరుగా ఫోన్ చేశారు. ఆస్తి పత్రాలు సోదాలు చేసేందుకు వచ్చామని, అరెస్టు చేసేందుకు కాదని వివరించి తలుపులు తెరిపించారు. ఆమె బయటకు వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడకు తరలించి అరెస్ట్ చేశారు.

వారణాసి వెళ్లేందుకు టిక్కెట్లు
రఘు, గాయత్రిలు అక్టోబరు 24వ తేదీన విజయవాడ నుంచి వారణాసికి వెళ్లేందుకు బుక్ చేసిన విమాన టిక్కెట్లు ఏసీబీ అధికారులకు లభ్యమయ్యాయి. వీటిని గాయత్రి బుక్ చేశారు. ఆమె ల్యాప్టాప్లో నుంచి ఈ టిక్కెట్టును స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు చేయించేందుకు వారణాసి వెళ్లాలనుకున్నామని, అందుకే టిక్కెట్లు బుక్ చేశామని ఆమె విచారణలో వెల్లడించారు.

కంపెనీలు తన పేరిటకు..
సాయిబాబానే నమ్ముకున్నామని, ఇప్పటివరకూ తమకు ఎలాంటి అన్యాయమూ చేయలేదని, తొలిసారి ఎందుకు బాబా ఇలా చేశారో అర్థం కావడం లేదని గాయత్రి వాపోయారు. ఇదిలా ఉండగా గాయత్రి సంస్థల్లో మొదట డైరెక్టర్గా వేరే వారు ఉన్నారు. ఆయనకు వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆయన ఐపీ పెట్టే అవకాశం ఉందన్న అనుమానంతో అతని పేరిట ఉన్న వ్యాపారాలను గాయత్రి తన పేరిట బదలాయించుకుంది.

5 ఏకరాల నుంచి రూ.500 కోట్లకు
ప్రభుత్వ అధికారిగా ముప్పై ఏళ్ల పాటు పని చేసి మరో మూడు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న రఘు ఏసీబీకి దొరికిపోయాడు. ఇతని స్వస్థలం బంగారుపాళ్యం మండలం మహాసముద్రం. అతనిది అతి సామాన్య కుటుంబం. అయిదెకరాల ఆస్తి ఉండేది. అక్రమాలతో ఇప్పుడు రూ.500 కోట్లు సంపాదించాడు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications