అవినీతి చేప: సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య ఆస్తులు రూ.50 కోట్లకు పైగానే
గాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో తనిఖీలు నిర్వహించారు.
గాజవాక: గాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో తనిఖీలు నిర్వహించారు.
విశాఖలో ఆరు, తిరుపతిలో 3, రాజమండ్రిలో నాలుగు.. మొత్తం పదమూడు చోట్ల సోదాలు నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎసిబి అధికారులు సోదాలు ప్రారంభించారు.
ఆయన ఇంటితో పాటు, బంధువుల ఇళ్లలోను సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు, రికార్టుల ట్యాంపరింగ్ కేసులు ఆయన పైన నమోదయ్యాయి. అధికారులు కీలక పత్రాలు పరిశీలిస్తున్నారు.

పందిమెట్టలో భారీగా బంగారం, నగదు గుర్తించారు. మూడు లాకర్లను అధికారులు గుర్తించారు. వడ్లపూడిలో రూ.1.20 కోట్ల ఆస్తులు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు 2011లోను ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడ్డాడు. అప్పుడు రూ.88 వేలు ఎక్కువగా ఉండటంతో పట్టుబడ్డాడు.
రూ.50 కోట్లకు పైగా ఆస్తులు
ఎసిబి అధికారులు రూ.50 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. చెన్నై, హైదరాబాదుల్లో ఆస్తులు ఉన్నాయని, అలాగే, తిరుపతి సమీపంలో పెద్ద ఎత్తున భూములు ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications