మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం: నిందితుడి అరెస్టు

పోలీసుల కథనం ప్రకారం - ఈ నెల 15వ తేదీన మైనర్ బాలిక కిడ్నాప్ జరిగింది. ఆమెను కిడ్నాప్ చేసిన సులేమాన్ పాతబస్తీలోని ఓ లాడ్జీలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కర్ణాటకలోని గుల్బర్గాకు తరలించాలని భావించాడు.
ఈలోగా బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. పలువురిని విచారించగా ఆ బాలికను ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా చూశామని చెప్పారు.
బాలిక కోసం పోలీసులు ముమ్మరంగా గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడు సులేమాన్పై అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పోలీసులు బాలిక తండ్రి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications