టి ప్రభుత్వం: గురుకుల్ తరహా ల్యాంకోహిల్స్ జోలికెళ్తే..
హైదరాబాద్: ల్యాంకో భూముల జోలికెళితే నష్టమేనని తెలంగాణ ప్రభుత్వానికి అధికారులు చెప్పారని వార్తలు వస్తున్నాయి. ల్యాంకో భూములను వక్ఫ్ భూములుగా పరిగణనలోకి తీసుకొని ముందుకెళితే ఇబ్బందులు తప్పవని చెప్పారట. ల్యాంకో వివాదంలో ప్రభుత్వం మరింత లోతుగా వెళితే సమస్యలు తప్పవని రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వానికి ప్రాథమికంగా సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రభుత్వ ఆదేశాలతో ల్యాంకో భూమిపై ఏ విధంగా అడుగులు వేయాలనే దానిపై అధికార యంత్రాంగం రెండు మూడు రోజులుగా తర్జన భర్జన పడుతోందట. ఈ భూమిపై న్యాయ నిపుణులతో చర్చించాకే ముందుకెళ్లాలని సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులు నిర్ణయించారట.
గురుకుల్ ట్రస్ట్ భూముల వ్యవహరంలో వెళ్లినట్లుగా ల్యాంకో భూముల విషయంలో వెళ్లలేమని ప్రభుత్వానికి తెలిపారట. ల్యాంకోపై ఆచితూచి అడుగులు వేయాలనుకుంటున్నారట. ఏపీఐఐసీ వేలంలో 108.05 ఎకరాల భూమిని ల్యాంకో కొనుగోలు చేసి, నిర్మాణాలు చేపట్టింది.